సమాజం అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదంటోంది హీరోయిన్ తాప్సి.
“పింక్” సినిమా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది. సమాజంలో మహిళలకు ఎదురవుతున్న పరిస్థితులు, వాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాల్ని బేస్ చేసుకొని “పింక్” సినిమా తెరకెక్కింది.
2016 సెప్టెంబర్ 16న పింక్ సినిమా రిలీజవ్వగా.. ఇప్పటికీ పరిస్థితులు అలానే ఉన్నాయని తాప్సి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో భాగమైనందుకు ఓవైపు గర్వంగా ఉన్నప్పటికీ, మరోవైపు సమాజంలో మహిళల పట్ల ధోరణిలో ఎలాంటి మార్పు రానందుకు బాధగా ఉందంటోంది తాప్సి. తాప్సి, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో తెరకెక్కింది పింక్ సినిమా. ఏకంగా జాతీయ అవార్డ్ దక్కించుకుంది.
ఇదే సినిమాను తమిళ్ లో అజిత్, తెలుగులో పవన్ కల్యాణ్ రీమేక్ చేసి విజయాలందుకున్నారు.