
సైలెంట్ గా.. అదే టైమ్ లో శరవేగంగా తన సినిమాను పూర్తిచేస్తున్నాడు రామ్ చరణ్. అదే ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ఫాస్ట్ గా నడుస్తోంది.
సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్ రిలీజైంది. సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడీ మూవీ నుంచి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభించాలని యూనిట్ నిర్ణయించింది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే వినాయక చవితి స్పెషల్ గా ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. చరణ్ సినిమాకు రెహ్మాన్ మ్యూజిక్ అందించడం ఇదే తొలిసారి. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.















