శర్వానంద్ తాజా చిత్రం “మనమే.” ఈ సినిమాలో శర్వా సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. తాజాగా ట్రయిలర్ రిలీజైంది. అందులో హీరోహీరోయిన్ల గిల్లికజ్జాల్ని చూపించారు. పరస్పరం విరుద్ధ భావాలు, ఆలోచన విధానం కలిగిన కపుల్ గా శర్వా-కృతి కనిపించారు.
ఈ సందర్భంగా ఓ కొత్త సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొచ్చాడు శర్వానంద్.
హీరోహీరోయిన్లు తిట్టుకుంటే సినిమాసూపర్ హిట్టు అవుతుందట. రెండు సినిమాల్ని కూడా ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. మురారి, ఖుషి సినిమాల్లో హీరోహీరోయిన్లు ఒకర్నొకరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఆ ఘర్షణ నుంచే ఓ మేజిక్ మూమెంట్ పుట్టుకొస్తుంది. అదే మేజిక్ ‘మనమే’ సినిమాకు కూడా వర్కవుట్ అవుతుందంటున్నాడు శర్వా.
శ్రీరామ్ ఆదిత్య డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అతడి కొడుకు కీలక పాత్ర చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు హేషమ్ సంగీతం అందించాడు. 7వ తేదీన థియేటర్లలోకి వస్తోంది మరి శర్వానంద్ చెప్తున్న తిట్టు సెంటిమెంట్ వర్క్ అవుతుందా?