
ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి గుర్తుందా? ఇటీవల ముగిసిన మహా కుంభమేళాలో ఈ అమ్మాయి అందం చూసి …హీరోయిన్లకు తక్కువ కాదు అంటూ సోషల్ మీడియా పనిలేని బ్యాచ్ ఒకటి వైరల్ చేసింది. సాయి పల్లవి వంటి హీరోయిన్ల కన్నా ఈ పల్లెటూరి అందమే గొప్ప అంటూ నార్త్ ఇండియన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ తెగ ప్రచారం చేశాయి.
ఆ అమ్మాయి, ఆమె కుటుంబం కుంభమేళాలలో పూసలు, గాజులు అమ్మకునేందుకు వచ్చింది. ఈ పూసలు అమ్మనుకునే అమ్మాయి ఇంత అందమా అంటూ ఎవరో ఒకరు, సోషల్ మీడియాలో పెట్టడం, ఆ ఫోటో వైరల్ కావడం, మీడియా దానికి ప్రచారం కల్పించడం, ఒక ఊరుపేరు లేని సినిమా దర్శకుడు ఆమెకి ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించుకోవడం, మళ్ళీ ఆ మీడియా ఆ వార్తకు ప్రచారం ఇవ్వడం… ఇలా అన్ని టకాటకా జరిగిపోయాయి.
సనోజ్ మిశ్రా అనే ఆ దర్శకుడు నిజంగా ఆమెతో సినిమా తీస్తాడా లేదా అన్నది కూడా ఎవరూ ఆలోచించలేదు. ఆమె పెద్ద హీరోయిన్ అయిపోయినట్లు ప్రచారం చేశారు. ఆమె సోషల్ మీడియా స్టార్ అయిపొయింది. కట్ చేస్తే నెల రోజుల తర్వాత ఇదిగో ఆ దర్శకుడు ఒక రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు.
మరో అమ్మాయికి (మోనాలిసాకి కాదు) సినిమా అవకాశాలు పేరుతో మాయమాటలు చెప్పి ఆమెని అత్యాచారం చేశాడట. ఆ కేసులో సనోజ్ మిశ్రా బెయిల్ కావాలని, అక్రమ కేసు అని వాదిస్తూ వచ్చాడు. ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు. కానీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ రోజు (మార్చి 31) పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
మరి మోనాలిసాతో సినిమా ఉంటుందా? ఆ అమ్మాయి హీరోయిన్ అవుతుందా? కాలమే సమాధానం చెప్పాలి.