విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందింది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అయ్యారు.
అక్టోబర్ 11న సినిమా sunNXT OTTలో 5 భాషల్లో విడుదల కాబోతున్నట్లు నిర్మాత తెలిపారు.
‘శబరి’ చిత్రం మే 3న థియేటర్లలో విడుదలయి మంచి స్పందన రాబట్టుకుంది. ఇప్పుడు ఓటిటి విడుదలకు సిద్ధమైంది.
”కుటుంబం అంతా కలిసి కూర్చుని చూడదగ్గ సినిమా ‘శబరి’. కథ, కథనాలు ఇన్నోవేటివ్గా ఉంటాయి. స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమిది. వరలక్ష్మీ శరత్ కుమార్ గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందీ సినిమా. ముఖ్యంగా ఆమె నటన ‘వావ్’ అనేలా ఉంటుంది,” అని చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల అన్నారు.