హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బెడ్ రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జిమ్ లో భారీ బరువులు మోసే ప్రయత్నం చేసిన రకుల్ తీవ్రంగా గాయపడింది. ఆమె వెన్నెముకకు గాయమైంది.
దీంతో వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆమె బెడ్ కే పరిమితమైంది. అయినప్పటికీ ఆమె ఓ పండగలో పాల్గొంది. ఉత్తరాదిన భార్యలంతా ఘనంగా జరుపుకునే కర్వా చౌత్ పండగను రకుల్ కూడా సెలబ్రేట్ చేసుకుంది.
పెళ్లయిన తర్వాత తొలిసారి వచ్చిన ఈ వేడుకను మిస్ అవ్వడం రకుల్ కు ఇష్టం లేదు. అందుకే నడుముకు బెల్ట్ కట్టుకొని మరీ కర్వాచౌత్ లో పాల్గొంది. తన భర్త పేరును చేతిపై మెహందీగా వేసుకొని, ఆ తర్వాత జాకీతో కలిసి సంప్రదాయ బద్ధంగా ఈ వేడుకలో పాల్గొంది.
మరికొన్ని రోజుల్లో ఆమె పూర్తిస్థాయిలో కోలుకుంటుంది. ఇన్నాళ్లూ తన బాడీ కంటే మైండ్ చాలా బలమైందని నమ్మానని, కానీ కొన్ని సందర్భాల్లో శరీరం చెప్పింది కూడా వినాలని రకుల్ చెప్పుకొచ్చింది. గాయంతో బెడ్ కు పరిమితమైన తనకు జీవితం స్తంభించిన ఫీలింగ్ వచ్చిందని, చాలా విషయాలు తెలిసొచ్చాయని, జ్ఞానోదయం అయిందని అంటోంది.