లావణ్య ఇష్యూతో బాగా డిస్టర్బ్ అయ్యాడు హీరో రాజ్ తరుణ్. కెరీర్ లో తొలిసారి భారీ వివాదాన్ని ఫేస్ చేస్తున్న ఈ హీరో, తన తాజా చిత్రం ప్రమోషన్ కు కూడా దూరమయ్యాడు. ఎక్కడ మీడియాకు ఎదురుపడితే, ఏ ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుందోనంటూ ఆందోళన చెందాడు
అలా రాజ్ తరుణ్ ప్రచారం లేకుండానే గత వారం థియేటర్లలోకి వచ్చింది “పురుషోత్తముడు” అనే సినిమా. ఆ సినిమాని ఎక్కడా ప్రచారం చెయ్యలేదు రాజ్ తరుణ్.
ఇప్పుడు “తిరగబడరా సామీ” ఆగస్టు 2న విడుదల అవుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆ హీరోయిన్ రాజ్ తరుణ్ ని తగులుకొని తనకు దూరం చేసింది అని రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఆరోపణలు చేసింది. సో ఈ సినిమా కూడా ప్రచారం లేకుండానే రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ రాజ్ తరుణ్ ఈ సినిమా ప్రచారం ప్రారంభించాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కలిసి ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే ఎక్కడా లావణ్య ఇష్యూ తెరపైకి రాకుండా, యాంకర్లు ఆ ప్రశ్నలు అడక్కుండా ఉండాలనే కండిషన్ మీద ఇంటర్వ్యూలు ఇచ్చినట్టున్నాడు.మొత్తానికి వివాదాన్ని టచ్ చేయకుండానే నాలుగు గోడల మధ్య ఇంటర్వ్యూలు ఇస్తూ, సినిమా ప్రచారం కానిస్తున్నాడు రాజ్ తరుణ్. ఇప్పట్లో అతడు నేరుగా మీడియా ముందుకు రాకపోవచ్చు.
“తిరగబడరా సామీ” అనే ఈ సినిమాకి ఎలాంటి హైప్ ఐతే లేదు. మరి ఈ వివాదం ఏమైనా కలిసొస్తుందా అనేది చూడాలి.