
దాదాపు ఎనిమిదేళ్లు నదియా తెలుగులో బిజీగా నటించింది. అమ్మ పాత్రలకు, అత్త పాత్రలకు ఆమె మెయిన్ అన్నట్లుగా సాగింది వ్యవహారం టాలీవుడ్ లో . “అత్తారింటికి దారేది” విజయంతో వచ్చిన క్రేజ్ అలా చాలా ఏళ్ళు కొనసాగింది.
ఐతే, కరోనా కాలం అనంతరం ఆమె ఊపు తగ్గింది. క్రేజ్ పోయింది. దాంతో ఆమెకి తెలుగులో అమ్మ పాత్రల అవకాశాలు తగ్గిపోయాయి. రెండుళ్లుగా ఆమెకి ఆఫర్లు రావడం లేదు.
2022లో ఆమె మహేష్ బాబు (‘సర్కారు వారి పాట”), నాని (అంటే సుందరానికి), వరుణ్ తేజ్ (“గని” ), రామ్ (వారియర్) వంటి హీరోల చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆమె సినిమాలు రాలేదు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత నదియా కనిపించింది.
ఆమె తాజాగా కేరళలో దర్శనమిచ్చింది. కేరళ సాహిత్య పండుగలో ఆమె పాల్గొంది. అలా సుదీర్ఘ విరామం తర్వాత ఒక సభలో కనిపించింది. మరి ఆమె మళ్ళీ కొత్త సినిమాలో కనిపించేదెపుడో?