
కిరణ్ అబ్బవరం హీరోగా ఇప్పటికే మంచి గుర్తింపు, సక్సెస్ అందుకున్నాడు. ఐతే కొన్ని అపజయాల తర్వాత బ్రేక్ తీసుకున్నాడు. మంచి కథలు, సినిమాలతో తిరిగి రావాలని గ్యాప్ తీసుకున్నాడట. ఇక ఇప్పుడు కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నాడు.
తాజాగా ఒక పీరియడ్ మూవీని సెట్ చేశాడు శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బడ్జెట్ 20 కోట్లు అని టాక్. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తీస్తున్నారు.
ఈ సినిమా కి కిరణ్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తుండడం విశేషం. షూటింగ్ కూడా పూర్తయింది.
సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదల కానుంది. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారట. అంటే కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఇది భారీ బడ్జెట్ చిత్రమే కాదు మొదటి పాన్ ఇండియా చిత్రం కూడా కాబోతుంది అన్నమాట.