వరుస ప్రాజెక్టులు, ఫొటోషూట్స్ తో నిత్యం బిజీగా ఉండే జాన్వికపూర్ అనారోగ్యం బారిన పడింది. మొన్నటి వరకు అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకల్లో పాల్గొంది. ప్రతి రోజూ వెళ్ళింది. ఆమె తిన్న ఆహారం ఎక్కడో కల్తీ అయింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైంది జాన్వి కపూర్.
వెంటనే జాన్వి కపూర్ ను ముంబయిలోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశాడు ఆమె తండ్రి బోనీ కపూర్. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమెకు తీవ్రస్థాయిలో ఫుడ్ పాయిజన్ అయిందని వైద్యులు తెలిపారు.
మరో 2 రోజుల పాటు జాన్వి కపూర్ హాస్పిటల్ లోనే ఉంటుందని, పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాతే ఇంటికి తీసుకొస్తానని బోనీ కపూర్ స్పష్టం చేశారు.
ఆమె నటించిన హిందీ చిత్రం “ఇలాజ్” వచ్చేనెల 2న విడుదల కానుంది. ఆ సినిమా ప్రచారంలో ఆమె పాల్గొనాల్సి ఉందిగా. మరోవైపు ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది.