
బిగ్ బాస్ సీజన్-8 ఇలా మొదలైందో లేదో అలా హాట్ టాపిక్ గా మారింది విష్ణు ప్రియ. “బిగ్ బాస్” హౌజ్ లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి ఆమె తన నోటి దురుసును బయటపెట్టడం మొదలుపెట్టింది. అలా హౌజ్ లో చాలామందికి దూరమైంది.
హౌజ్ లో అడుగుపెడుతూనే తనలో అందాలు ఎక్కువ అని చెప్పుకుంది విష్ణు ప్రియ. అది నిజమే కాబట్టి కంటెస్టెంట్లు పెద్దగా పట్టించుకోలేదు. కొంతమంది మహిళా కంటెస్టెంట్లు తనకి పొగరు అని మనసులో అనుకున్నప్పటికీ బయట పడలేదు.
ఎప్పుడైతే ఆమె మణికంఠపై నోరు పారేసుకుందో, ఆ క్షణం నుంచి ఆమె ఏకాకిగా మారడం మొదలైంది. తనలో ఫెమినిజం ఎక్కువ అని చెప్పుకున్న విష్ణుప్రియ, అదే టైమ్ లో మణికంఠతో మాట్లాడుతూ.. మీలో మగతనం తక్కువ ఆడంగితనం ఎక్కువ అనే అర్థం వచ్చేలా మాట్లాడింది.
అప్పట్నుంచి విష్ణుప్రియను టార్గెట్ చేశాడు మణికంఠ. సరైన సమయం కోసం వేచి చూశాడు. ఆ టైమ్ రానే వచ్చింది. బిగ్ బాస్ తొలి రౌండ్ ఎలిమినేషన్స్ లో భాగంగా విష్ణుప్రియను నామినేట్ చేశాడు మణికంఠ.

అలా విష్ణుప్రియ మెడపై కత్తి వేలాడుతోంది.
ఎలిమినేషన్ రౌండ్ కు బేబక్క, విష్ణు ప్రియ, మణికంఠ, పృథ్వీ రాజ్, సోనియా ఆకుల, ఆర్జే శేఖర్ బాషా నామినేట్ అయ్యారు. వీళ్లలో ఎంతమంది హౌజ్ లో ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారో బిగ్ బాస్ తేలుస్తాడు.