“డబుల్ ఇస్మార్ట్” మొదటి ఈవెంట్ కు రెడీ అయింది. ఈ సినిమా నుంచి ట్రయిలర్ రెడీ అయింది. దీన్ని విడుదల చేయడానికి వైజాగ్ ను కేంద్రంగా ఎంచుకున్నారు. 4వ తేదీన వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో “డబుల్ ఇస్మార్ట్” ట్రయిలర్ ను లాంచ్ చేయబోతున్నారు.
“డబుల్ ఇస్మార్ట్” టీజర్ ఇప్పటికే క్లిక్ అయింది. తాజాగా రిలీజ్ చేసిన పాటలు కూడా బాగున్నాయి. దీంతో ట్రయిలర్ పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, పూరి మార్క్, రామ్ మేనరిజమ్స్ మిస్సవ్వకుండా, పంచ్ డైలాగ్స్ తో ట్రయిలర్ కట్ చేశారు.
“డబుల్ ఇస్మార్ట్” ను పూరి కనెక్ట్స్ బ్యానర్ పై చార్మి-పూరి కలిసి ప్రొడ్యూస్ చేశారు. మణిశర్మ సంగీతం అందించారు. సినిమాలో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ఈ మూవీ. పూరికి ఇది ఇజ్జత్ కా సవాల్ అనుకోవచ్చు. ఆయన గత చిత్రం “లైగర్” ఘోరంగా పోయింది. ఇక రామ్ కూడా వరుస ఫ్లాప్ ల్లో ఉన్నాడు. ఇద్దరి కలిసి చేసిన ఈ సీక్వెల్ కచ్చితంగా ఆడాలి. రామ్ కి ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు ఉన్నాయి. కానీ, ఇది ఆడకపోతే పూరికి డేట్స్ ఇచ్చే హీరోలు కరువు అవుతారు.
పూరి, డబుల్ ఇస్మార్ట్, వైజాగ్, రామ్ పోతినేని