శ్రీవారి లడ్డూపై స్పందించేందుకు టాలీవుడ్ నటీనటులంతా వెనకడుగు వేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడం, పైగా దేవుడు, రాజకీయాలతో ముడిపడిన వ్యవహారం కావడంతో చాలామంది ఈ విషయంపై నోరు విప్పలేదు. అయితే హీరోయిన్ దక్ష నగార్కర్ మాత్రం దీనిపై ఓపెన్ గా స్పందించింది.
శ్వాగ్ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన దక్ష.. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణలు నిజమైతే.. దోషులను కఠినంగా శిక్షించాల్సిందనంటూ అభిప్రాయపడింది. ఎంతో పవిత్రంగా భావించే ఈ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిస్తే.. శాకాహారులు, బ్రాహ్మణుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తోంది.
తక్కువగా సినిమాలు చేసినా ఎక్కువగా మీడియాను ఎట్రాక్ట్ చేస్తుంది దక్ష. ఆమె ఫొటోషూట్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. అప్పుడప్పుడు కాస్త బోల్డ్ గా కూడా కనిపిస్తుంటుంది ఈ చిన్నది.
సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ.. తనకు త్వరలోనే బ్రేక్ వస్తుందని గట్టిగా చెబుతోంది.