దర్శకుడు అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. షారుక్ ఖాన్ తో ‘జవాన్’ తీసిన తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తాడని భావించారు. కానీ అల్లు అర్జున్ తో చేసిన చర్చలు ఫలించలేదు. దాంతో, అట్లీ ఒక భారీ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. అది సల్మాన్ ఖాన్ తో ఉంటుంది అని మీడియా భావిస్తోంది.
“మీరు అనుకుంటున్నవి నిజం కావొచ్చు. కానీ మీరు ఊహించని విధంగా కాస్టింగ్ ఉంటుంది. ఒక్క మాట ఐతే చెప్పగలను నా తదుపరి చిత్రం ఇండియా గర్వించేవిధంగా ఉంటుంది. మీరు ఆశ్చర్యపోయే నటులు ఉంటారు. ఆ దిశగా ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. రెండు, మూడు వారాల్లో అంతా సెట్ అవుతుంది,” ఇలా తన కొత్త సినిమా గురించి చెప్పాడు అట్లీ.
తెలుగుసినిమా.కామ్ కి తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం… అట్లీ మల్టీస్టారర్ సినిమా తీయబోతున్నాడు. సల్మాన్ ఖాన్ తో పాటు ఇద్దరు హాలీవుడ్ నటులు, ఇద్దరు దక్షిణ భారతీయ హీరోలు నటిస్తారు. ఆ నటుల పేర్లు ఫైనలైజ్ అయితే ఈ సినిమా “బాప్ ఆఫ్ మల్టీస్టారర్” అవుతుంది అని చెప్పొచ్చు.
తమిళంలో వరుసగా విజయ్ తో మూడు బ్లాక్ బస్టర్స్ తీశాడు అట్లీ. బాలీవుడ్ లో మొదటి ప్రయత్నమే… షారుక్ ఖాన్ నటించిన జవాన్. అది రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు మరింత భారీ చిత్రం సెట్ చేస్తున్నాడు.