సంక్రాంతి 2025కి విడుదల కావాల్సిన మెగాస్టార్ చిరంజీవి మూవీ “విశ్వంభర” డౌట్ లో పడింది. ఆ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. ఇక ఆ మూవీ స్థానంలో అజిత్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్న “గుడ్ బ్యాడ్ అగ్లీ” విడుదల కానుంది.
తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మాడ్రిడ్ లో జరుగుతోంది. ఈ కీలకమైన షెడ్యూల్ లో అజిత్ కుమార్, ఇతర నటీనటులపై సన్నివేశాలు తీస్తున్నారు. తాజాగా మేకర్స్ అజిత్ కుమార్ ఫోటోని ని రిలీజ్ చేశారు నిర్మాతలు. అజిత్ స్టయిలీష్ గా ఉన్నారు.
ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
అజిత్ నటించిన మరో చిత్రం “విడా ముయార్చి” ఎదో సమస్యలో పడ్డట్లు ఉంది. అందుకే, ఆ సినిమా విడుదల గురించి మాట్లాడకుండా ఈ సినిమాని ముందుకు తెస్తున్నారు.