‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు అనీల్ రావిపూడి. వెంకీ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారు. సినిమాలో వెంకటేష్ కు భార్యగా నటించింది ఐశ్వర్య
ఈ పాత్ర కోసం నలుగురు హీరోయిన్ల పేర్లు అనుకున్నాడట అనీల్ రావిపూడి. వాళ్లలో ఫైనల్ గా నిత్యామీనన్ ను, ఐశ్వర్య రాజేశ్ ను ఫైనల్ చేశారట. నిత్యామీనన్ అందుబాటులో లేకపోవడంతో, ఆ పాత్రకు ఐశ్వర్య రాజేష్ ను తీసుకున్నారట.
ఆ పాత్రను ఐశ్వర్య రాజేష్ అంగీకరించడం చాలా గ్రేట్ అంటున్నాడు రావిపూడి. ఎందుకంటే, ఈ సినిమాలో నలుగురు పిల్లలకు తల్లిగా కనిపిస్తుందంట ఐశ్వర్య. నెరేషన్ లో ఈ విషయం ఆమెకు చెప్పినప్పటికీ.. క్యారెక్టర్ బలంగా ఉండడంతో నటించడానికి ఐశ్వర్య రాజేష్ అంగీకరించిందంటున్నాడు.
‘గోదారి గట్టు’ పాటలో వెంకీ-ఐశ్వర్య కాంబినేషన్ ను చూసిన జనం.. వెంకటేశ్-సౌందర్య కాంబినేషన్ తో పోలుస్తున్నారని.. ఆ సాంగ్ హిట్టవ్వడం తన సినిమాకు ప్లస్ అయిందంటున్నాడు.