
అల్లు అర్జున్ – అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ హైదరాబాద్ విచ్చేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ఐదుగురు హీరోయిన్లు ఉంటారు.
ప్రస్తుతం పక్కాగా కన్ఫిర్మ్ అయింది మాత్రం ఇద్దరు భామలే. ఒకరు జాన్వీ కపూర్, మరొకరు మృణాల్ ఠాకూర్.
మిగతా ముగ్గురిలో ఇద్దరి పేర్లు తాజాగా చర్చల్లోకి వచ్చాయి. ఒకరు దీపిక పదుకోన్. ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా ఆమె నుంచి వెళ్ళిపోయింది. ఆమె డిమాండులు తట్టుకోలేక దర్శకుడు సందీప్ వంగా దీపిక స్థానంలో మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఆమె అల్లు అర్జున్ సినిమా సైన్ చేసే అవకాశం ఉంది.
మరో ఇద్దరు విదేశీ భామలు అయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం… దీపిక, జాన్వీ, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నటిస్తారు. దాదాపు 800 కోట్ల రూపాయలతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దానికి తగ్గట్లే నటీనటుల ఎంపిక జరుగుతోంది.