
నాని హీరోగా “‘ఎవడే సుబ్రహ్మణ్యం” అంటూ మూవీ తీశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అది అతనికి మొదటి చిత్రం. ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ పదేళ్ల కాలంలో ఈ దర్శకుడు కేవలం మూడే సినిమాలు తీశాడు. అవి… ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి 2898 AD.
మార్చి 21న ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మళ్ళీ విడుదల అవుతోంది.. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు.
ఎవడే, మహానటి, కల్కి… ఈ మూడింట్లో మీ బెస్ట్ వర్క్ ఏంటి?
ముగ్గురు పిల్లల్లో ఎవరు ఇష్టమంటే ఎలా చెపుతాం? “మహానటి” సినిమా దర్శకుడిగా చాలా సంతృప్తినిచ్చింది. దానికి కారణం.. ఆ సినిమాకి చాలా టైం దొరికింది. సినిమాని మరింత మెరుగు చూసుకునే వెసులుబాటు, సమయం లభించింది. అందుకే, బాగా వచ్చింది.
కల్కి2 ని ఎప్పుడు మొదలు పెడుతున్నారు?
ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ఉండొచ్చు. ప్రభాస్ డేట్స్ అవీ చూసుకోవాలి.
ఈ పదేళ్లలో మూడు సినిమాలే తీశారు? మీ కేరీర్ పట్ల సంతోషంగా ఉన్నారా?
కల్కి సినిమాకి ఎక్కువ టైం పట్టింది. అలాంటి భారీ సినిమాని రెండేళ్లలో పూర్తి చెయ్యలేం. నటీనటుల డేట్స్, విజువల్ ఎఫెక్ట్స్, సెట్లు… ఇలా చాలా తతంగం దర్శకుడి చేతిలో ఉండవు. కెరీర్ పరంగా చాలా తృప్తిగా ఉన్నాను. నేను చేసిన జాన్రా, కథ మరొకరు చేయలేదు. తీసిన మూడూ హిట్టే. చాలా హ్యాపీగా ఉంది.
విజయ్ దేవరకొండని మూడు సినిమాల్లో రిపీట్ చేశారు. నానిని తీసుకోలేదు ఎందుకని?
“కల్కి”లో నానిని తీసుకోవాలి అనుకున్నాం. వర్క్ అవుట్ కాలేదు. ఈ సారి వర్కవుట్ చేస్తాం.