శ్రద్ధ కపూర్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె పేరు వల్లే, ఆమె క్రేజ్ కారణంగానే ఇటీవల విడుదలైన ‘స్త్రీ 2’ సినిమా ఏకంగా ఇండియాలో 600 కోట్ల రూపాయల వసూళ్లు అందుకొంది. తనకు ఉన్న ఈ పాపులారిటీని ఆమె ఫుల్లుగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె ఈ ప్రయత్నమే తెలుగు నిర్మాతలను భయపెట్టిస్తోంది.
ఆమె తెలుగులో ఇంతకుముందు “సాహో” సినిమాలో నటించింది. కానీ అప్పటికి, ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. తెలుగు సినిమాల బడ్జెట్స్ పెరిగాయి. అలాగే ఆమె పారితోషికం కూడా ఎక్కువైంది. తాజాగా ఆమెని “పుష్ప 2” సినిమాలో “కిస్సిక్” అనే ఐటెం సాంగ్ కి సంప్రదించారు. కానీ ఆమె 8 కోట్లు ఇస్తేనే చేస్తాను అని చెప్పిందట. దాంతో శ్రీలీలకు 2 కోట్లు ఇచ్చి మమ అనిపించారు. అలాగే, నానితో ‘దసరా’ దర్శకుడు తీస్తున్న కొత్త సినిమా కోసం ఆమెని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. నాని చాలాకాలంగా హిందీ మార్కెట్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు కానీ రావట్లేదు. శ్రద్ధలాంటి టాప్ హీరోయిన్ నటిస్తే తనకు హిందీ మార్కెట్ వస్తుంది అని భావించాడు.
ALSO READ: Shraddha Kapoor’s last photoshoot of 2024
నానితో నటించేందుకు శ్రద్ధ ఒప్పుకుందట. కానీ ఆమె అడిగిన పారితోషికం అక్షరాలా 12 కోట్లు. దాంతో నిర్మాత భయపడిపోయి ఇప్పుడు కొత్త హీరోయిన్ తో సినిమా చేద్దామని భావిస్తున్నారట.
శ్రద్ధ తనకున్న క్రేజ్ కి తగ్గట్లు పారితోషికం డిమాండ్ చెయ్యడం తప్పులేదు. ఒక్క హిట్ కొట్టగానే తెలుగు హీరోలు డబులు త్రిబుల్ గా పెంచేస్తారు రెమ్యునరేషన్. మరి ఆమెకున్న పాపులారిటీని వాడుకోవాలని తెలుగు నిర్మాతలు ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె కూడా గట్టిగానే పారితోషికం డిమాండ్ చేస్తుంది కదా..