
త్వరలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సెట్స్ పైకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా షూటింగ్ అప్ డేట్స్ బయటకొచ్చాయి. నవంబర్ నెలాఖరు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది.
మైసూర్ లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. నిజానికి హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ అనుకున్నారు. కానీ సెట్ అందుబాటులోకి రాలేదు. అందుకే మైసూర్ లో 2 వారాల షెడ్యూల్ పూర్తిచేసి, ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్న భారీ సెట్ లోకి షిఫ్ట్ అవుతారు.
సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం ఈ సెట్ లోనే ఉంటుంది. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించబోతోంది. ఆమె ఫస్ట్ షెడ్యూల్ లో జాయిన్ అవుతుందా అవ్వదా అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే 3 పాటల కంపోజిషన్ పూర్తిచేశాడు కూడా. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న సినిమా ఇదే. చరణ్, బుచ్చిబాబు సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారు. దాదాపుగా ఇదే టైటిల్ ఫిక్స్.