నిత్య మీనన్ కి ఉన్నట్టుండి తమిళంలో అవకాశాలు ఎక్కువ అయ్యాయి. ఈ ఏడాది ఏకంగా ఆమె నటించిన నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. మొదటి చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది.
జయం రవి హీరోగా నిత్య హీరోయిన్ గా నటించిన “కాదలిక్క నేరమిల్లై” (Kadhalikka Neramillai) ఈ జనవరి 14న థియేటర్లలోకి వస్తుంది. అలాగే ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న “ఇడ్లి కడాయి” అనే చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ రెండూ ప్రముఖ హీరోలు నటించిన చిత్రాలే.
అలాగే విజయ్ సేతుపతితో ఒక మూవీ షూటింగ్ దశలో ఉంది. “డియర్ ఎక్స్ఎస్” అని చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న చిత్రం కూడా ఈ ఏడాది రానుంది. మొత్తంగా 2025లో ఈ భామ చాలా బిజీ ఆర్టిస్ట్ గా నిలవనుంది.
ఆ మధ్య బాగా లావు కావడంతో ఆమెకి అవకాశాలు తగ్గాయి. తెలుగులో పూర్తిగా ఆఫర్లు బంద్ కావడానికి కారణం అదే. ఐతే ఉత్తమనటిగా పేరున్న ఈ భామ ఇటీవల బ్రేక్ తీసుకొని సరికొత్తగా దర్శనమిస్తోంది. కొత్త చిత్రాలు సైన్ చేస్తోంది.