
ఎదుటి వ్యక్తిని గౌరవించడంలో పరిశ్రమలో చిరంజీవి తర్వాతే ఎవరైనా. చిన్న నటుడిపైనా, జర్నలిస్ట్ అయినా, మరో రంగానికి చెందిన వ్యక్తి అయినా అందరికీ సమప్రాధాన్యం ఇస్తారు చిరంజీవి. వాళ్లకు తగిన గౌరవం ఇస్తారు. అదే ఆయన్ను అందరివాడిని చేసింది.
నటి మధుబాల స్టేట్ మెంట్ తో ఈ విషయం మరోసారి తెరపైకొచ్చింది. చిరంజీవి తనకు అపారమైన గౌరవం ఇవ్వడం చూసి తను ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది.
కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఓసారి చిరంజీవిని కలిసిందంట మధుబాల. అప్పటికే ఆయన మెగాస్టార్. అయినప్పటికీ తనను చూసి కుర్చీలోంచి లేచి విష్ చేశారని, అప్పుడు తను ఆశ్చర్యపోయానని అన్నారు.
లాంగ్ బ్యాక్ తర్వాత రీసెంట్ గా మరోసారి చిరంజీవిని కలిసి అవకాశం దక్కిందని, ఈసారి కూడా ఆయన అదే విధంగా కుర్చీలోంచి లేచి తనకు రెస్పెక్ట్ ఇచ్చారని, తను కూర్చున్న తర్వాతే ఆయన కూర్చున్నారని మధుబాల గుర్తుచేసుకుంది.
అప్పటికీ ఇప్పటికీ చిరంజీవి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని గుర్తుచేసుకుంది మధుబాల. చిరంజీవి అంటేనే గౌరవానికి ఓ ప్రతీక అని అంటోంది.