ప్రభాస్ చేయబోయే ‘స్పిరిట్’ సినిమా ఎక్కువగా నలుగుతోంది. ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల్లో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సినిమానే. దీనికి కారణం సందీప్ రెడ్డి వంగ, ‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టడమే.
ఇక ‘స్పిరిట్’ సినిమా విషయానికొస్తే, ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కరీనా కపూర్ ను తీసుకుబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది ఇప్పటిది కాదు, దాదాపు నెల రోజులుగా జరుగుతున్న ప్రచారం.
ఎట్టకేలకు దీనిపై స్పందించింది కరీనా కపూర్. “ప్రభాస్ సరసన హీరోయిన్ గానా… నో ఛాన్స్” అంటూ స్పందించింది కరీనా. ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి తనను ఎవ్వరూ సంప్రదించలేదని, తన వరకు ఎవ్వరూ రాలేదని ఆమె స్పందించింది. ఓ టాక్ షోలో పాల్గొన్న కరీనా, ఇలా ‘స్పిరిట్’ సినిమాపై క్లారిటీ ఇచ్చింది.
నిజానికి ఈ టాక్ బయటకొచ్చిన వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ వ్యతిరేకించారు.
వయసైపోయిన కరీనాను తీసుకోవద్దంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఉద్యమమే మొదలుపెట్టారు. కరీనా తాజా స్టేట్ మెంట్ తో వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాలీవుడ్ లో సినిమాకు బజ్ రావాలంటే కరీనా కాకపోయినా, మరో హీరోయిన్ ను తీసుకోవాల్సిందే. అది ఎవరనేది సందీప్ వంగ త్వరలోనే తేలుస్తాడు.