ఖాళీ టైమ్ దొరికితే క్రికెట్ ఆడడం తమన్ కు ఇష్టం. అదే ఖాళీ టైమ్ దొరికితే కన్సర్ట్స్ పెట్టుకోవడం దేవిశ్రీ ప్రసాద్ కు ఇష్టం. ఇప్పుడీ మ్యూజిక్ డైరక్టర్ కు మరోసారి ఫ్రీ టైమ్ దొరికినట్టుంది.
దేవిశ్రీ ప్రసాద్ మరో మ్యూజికల్ కన్సర్ట్ కు రెడీ అయ్యాడు. ఈసారి అతడు ఏ దేశం వెళ్తున్నాడు అనేగా మీ ప్రశ్న. ఆయన ఏ దేశం వెళ్లడం లేదు. ఈసారి వెరైటీగా మన దేశంలోనే టూర్ పెట్టుకున్నాడు. దీనికి సంబంధించి చిన్న పజిల్ కూడా పెట్టాడు.
ఇండియాలోనే తన నెక్ట్స్ కన్సర్ట్ ఉంటుందని ప్రకటించిన డీఎస్పీ.. ముందుగా ఏ సిటీలో అడుగుపెడతానో గెస్ చేయమంటూ క్విజ్ కార్యక్రమం పెట్టాడు. ఇప్పటికే దుబాయ్, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల్లో అదిరిపోయే ప్రదర్శనలిచ్చిన ఈ సంగీత దర్శకుడు.. ఇప్పుడు భారతాన్ని ఉర్రూతలూగించబోతున్నాడు.
ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడి చేతిలో తండేల్, కుబేర, పుష్ప-2, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలున్నాయి. ఇవన్నీ క్రేజీ ప్రాజెక్టులే. అయినప్పటికీ దేవిశ్రీ టైమ్ కుదుర్చుకున్నాడు. ప్రదర్శనకు సిద్ధమౌతున్నాడు.