40 ఏళ్లొచ్చినా పెళ్లికి దూరంగా ఉండే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. త్రిష, అనుష్క, సదా, టబు.. ఇలా వీళ్లంతా పెళ్లికి దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి చేరేందుకు తహతహలాడుతోంది హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి.
34 ఏళ్ల ఐశ్వర్య లక్ష్మి, తను జీవితంలో పెళ్లి చేసుకోనని అంటోంది. తనకు 29 ఏళ్లకే జ్ఞానోదయం అయిందని, వైవాహిక జీవితంలోకి అస్సలు అడుగుపెట్టనని అంటోంది. ఈ విషయంలో తనను ఎవ్వరూ ప్రభావితం చేయలేరని కూడా చెబుతోంది.
నిజానికి పాతికేళ్ల వరకు పెళ్లిపై ఐశ్వర్య లక్ష్మికి సదభిప్రాయం ఉండేదట. ఎన్నో పెళ్లిళ్లను దగ్గరుండి చూసిందంట. ఒక దశలో మాట్రిమోనీ సైట్ లో తన ప్రొఫైల్ కూడా పెట్టిందంట. అయితే చాలామంది ఆ ప్రొఫైల్ చూసి ఫేక్ అనుకున్నారట.
ఎప్పుడైతే తన చుట్టుపక్కలున్న చాలామంది జంటల్ని చూశానో, అప్పుడిక పెళ్లిపై సదభిప్రాయం పోయిందంటోంది. పెళ్లి చేసుకున్న తర్వాత వ్యక్తిగత ఎదుగుల ఉండదనేది ఐశ్వర్య లక్ష్మి అభిప్రాయం.
ప్రస్తుతం ఈమె సాయిదుర్గతేజ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమధ్య ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.