
ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు తెలుగు మీద ఫోకస్ పెట్టింది. పనిలో పనిగా గ్లామర్ షోకి సిద్ధమైంది. ముందుగా హాట్ హాట్ ఫొటోలతో ఇన్ స్టాగ్రామ్ లో హల్చల్ చేస్తోంది.
ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం తెలుగులో “సంబరాల ఏటిగట్టు” అనే సినిమాలో నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ హీరో ఇందులో. సినిమా మొత్తం ఈ భామ మట్టి, దుమ్ము కొట్టిన ముఖంతోనే కనిపిస్తుందట. కథ అలాంటిది మరి. అందుకే, ఇది విడుదలకు ముందే కొన్ని గ్లామర్ పాత్రలు తెచ్చుకుంటే కెరియర్ బ్యాలెన్స్ అవుతుంది అని భావిస్తోంది.
ఈ భామకి గ్లామర్ హీరోయిన్ గా క్రేజ్ లేదు. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాల్లో కాస్తో కూస్తో ఆమెకి గుర్తింపు తెచ్చింది మణిరత్నం తీసిన “పొన్నియన్ సెల్వన్” చిత్రాలే.
ALSO READ: Mind your own business, says Aishu
ప్రస్తుతం ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో అందాల ఆరబోతతో కూడిన ఫోటోలను, ఫోటోషూట్ వీడియోలను షేర్ చేస్తోంది.