ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య రజినీకాంత్ విడిపోవాలని రెండేళ్ల క్రితం నిర్ణయించుకున్నారు. 2022లో తాము ఇద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. అయితే,కొన్ని నెలల తర్వాత ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం ఐశ్వర్య తండ్రి సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రయత్నించిన మాట వాస్తవం.
కానీ రజినీకాంత్ ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరూ మళ్ళీ కలిసి భార్యాభర్తలుగా బతకలేరని అర్థమైందట. ఇటు ధనుష్, అటు ఐశ్వర్య కూడా వారి వారి జీవితాల్లో మూవ్ ఆన్ అయిపోయారు. ధనుష్ హీరోగా బిజీ అవగా, ఆమె డైరెక్టర్ గా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి తమ ఇద్దరి కొడుకులను ఇద్దరూ చూసుకుంటున్నారు.
ఇకపై కూడా పిల్లలకు సంబంధించి ఇద్దరూ బాధ్యత వహించాలని నిర్ణయించుకున్నారట. ఐతే ఇక ఇప్పుడు లీగల్ గా విడిపోవాలని కోర్టులు విడాకులకు పిటిషన్ దాఖలు చేసినట్లు చెన్నై మీడియా కథనం.
పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా విడిపోబోతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవద్దని కూడా డిసైడ్ అయ్యారట.