కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్ కథానాయకుడిగా నటించిన చిత్రం… ‘మ్యాక్స్’. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. డిసెంబర్ 27న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా తెలుగులో విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ వచ్చేసింది.
వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, ‘అఖండ’ ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్రల్లో నటించారు. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు.
‘మా పొలిటికల్ కెరీర్ కి ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్’ అని వాయిస్ ఓవర్లో డైలాగ్ వస్తుండగా ట్రైలర్ మొదలైంది. ‘చావు ఎదురొచ్చినా సరే మా అబ్బాయి ఒంటరిగా నిలబడి పోరాడతాడు’ అని హీరో మదర్ డైలాగ్ చెప్పిన తర్వాత కిచ్చా సుదీప్ ఎంట్రీ అదిరింది.
‘మ్యాక్స్తో మాట్లాడేటప్పుడు మ్యాగ్జిమమ్ సైలెన్స్ ఉండాలి’ అని ట్రైలర్ చివర్లో సుదీప్ చెప్పే డైలాగ్ మాస్ ప్రేక్షకుల కోసమే అని అర్థం అవుతోంది.