సాయి పల్లవికి భక్తి ఎక్కువ. ఆమె కుటుంబం అంతా పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తులు. ఆమె పేరులోని సాయి వెనుక కారణం అదే.
తాజాగా సాయి పల్లవి కొత్త ఏడాది 2025 వేడుకలను పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా ఆశ్రమంలో జరుపుకొంది. ఆశ్రమంలోని సాయికల్వంత్ మందిరంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆమె, ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పట్టు చీర ధరించి అందరి భక్తులతో కలిసి పూజలో కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ఈ సందర్భంగా అందరూ సన్మార్గంలో పయనించాలని కోరినట్లు మీడియా కథనం.
ఇటీవలే తమిళంలో “అమరన్” సినిమాతో భారీ విజయం అందుకున్న సాయి పల్లవికి 2025లో పలు చిత్రాలు విడుదల సిద్ధంగా ఉన్నాయి. అందులో నాగచైతన్య హీరోగా నటించిన “తండేల్” ఉంది. అలాగే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ తో కలిసి నటించిన బాలీవుడ్ మూవీ కూడా 2025లోనే రిలీజ్ కానుంది.