పాయల్ రాజపుత్ కి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. ఆ మధ్య “మంగళవారం” అనే సినిమాలో చాలా బోల్డ్ గా నటించింది. ఆ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరుగుతుంది అని భావించారు సినిమా విశ్లేషకులు. కానీ అలాంటిదేమి జరగలేదు.
దాంతో ఈ భామ ఇప్పుడు తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తమిళంలో ఈ భామ ప్రస్తుతం లెజెండ్ శరవణన్ సరసన నటిస్తోంది.
నడి వయసులో హీరోగా మారిన శరవణన్ ని లెజెండ్ శరవణన్ అని పిలుస్తారు. తన పేరుని తానే లెజెండ్ గా మార్చుకున్నాడు ఈ ముదురు హీరో. ఆయన సరసన ఈ భామ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. అక్కడి నుంచి తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. కానీ తన ముదురు హీరో తన ఫొటోల్లో లేకుండా జాగ్రత్త పడుతోంది.
పాయల్ రాజ్ పుత్ “ఆర్ ఎక్స్ 100” సినిమాతో సంచలనం రేపింది. ఆ తర్వాత “వెంకీ మామ “ఎన్టీఆర్ కథానాయకుడు”, “తీస్ మార్ ఖాన్”, “డిస్కో రాజా” వంటి సినిమాలు చేసింది.