కుప్పం నుంచి వచ్చేవాళ్లు సాధారణంగా చంద్రబాబు ఫ్యాన్స్ ఉంటారు లేదా నారా లోకేష్ అభిమానులైనా అయి ఉంటారు. కానీ కుప్పం నుంచి ముగ్గురొచ్చారు. వాళ్లు ఎన్టీఆర్ అభిమానులు.
అభిమాన హీరోని కలిసేందుకు ఫ్యాన్స్ చేసే సాహసాలు చాలానే చూశాం. ఇది కూడా అలాంటి సాహసమే. కుప్పం నుంచి ఈ ముగ్గురు నడుచుకుంటూ హైదరాబాద్ చేరుకున్నారు. అక్షరాలా 620 కిలోమీటర్లు నడిచారు.
కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ వీళ్లు తమ పాదయాత్ర ప్రారంభించారు. చేతిలో పెద్ద ఫొటో పట్టుకొని వందల కిలోమీటర్లు అలా నడుస్తూనే ఉన్నారు. విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లింది.
వెంటనే తన ఇంటికి పిలిపించుకున్నాడు తారక్. తన వీరాభిమానులకు షేక్ హ్యాండ్ ఇచ్చి, వాళ్లకు తనతో ఫొటోలు దిగే అవకాశం కల్పించాడు. అంత దూరం నడవకూడదంటూ వాళ్లను సున్నితంగా హెచ్చరించాడు కూడా. ఆ తర్వాత వాళ్లిచ్చిన ఫొటోను అందుకున్నాడు.
This is why he’s the PEOPLE’S HERO ❤️❤️
— Vamsi Kaka (@vamsikaka) November 15, 2024
MAN OF MASSES @Tarak9999 met fans who walked all the way from Kuppam. He spent time with them and made their day with his warmth 😍✨ #ManOfMassesNTR #NTR pic.twitter.com/FmR7vok8w8