
నిత్యా మీనన్ ఇచ్చి పడేసింది. సోషల్ మీడియాలో ఒక్కోసారి ఉన్నట్టుండి ఫైర్ అవుతుంది ఈ బ్యూటీ. ఇది కూడా అలాంటి సందర్భమే. తన తప్పు లేకుండా ట్రోలింగ్ చేస్తున్న ఓ బ్యాచ్ కు ఆమె తిరుగులేని కౌంటర్ ఇచ్చింది.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. రీసెంట్ గా ఓ కార్యక్రమానికి హాజరైంది నిత్యా మీనన్. అక్కడికి ఆమె అభిమానులు చాలామంది వచ్చారు. ఓ అభిమాని, ఆమెకు దగ్గరగా వెళ్లాడు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు.
కానీ నిత్యామీనన్ మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అతడికి రెండు చేతులతో నమస్కారం పెట్టి వెళ్లిపోయింది. ఆ వెంటనే స్టేజ్ ఎక్కిన ఆమె, ఓ నటుడ్ని మాత్రం కౌగిలించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చింది. దీనిపై చాలామంది ఆమెను విమర్శించారు.
ఈ విమర్శలపై నిత్యా మీననే స్పందించింది. చాలామంది మమ్మల్ని ఈజీగా టచ్ చేయొచ్చనే ఆలోచనతో ఉంటారని, హీరోయిన్లు ఆట బొమ్మలు కాదనే విషయాన్ని అంతా గుర్తించాలంటూ కౌంటర్ ఇచ్చింది.