
త్వరలోనే ఓ పెద్ద సినిమా ప్రకటన రాబోతోందంటూ ఊరిస్తూ వస్తున్నారు దిల్ రాజు. ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. బన్నీ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించారు దిల్ రాజు. అయితే దానికి ఇంకా టైమ్ ఉందంటున్నారు.
2026లో ప్రారంభించాల్సిన సినిమాలపై ప్రస్తుతం దిల్ రాజు వర్క్ చేస్తున్నారు. ఆ సినిమా కథలన్నీ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయని, ఆ మూవీల స్క్రిప్టులు కొలిక్కి వచ్చిన తర్వాత బన్నీ సినిమాపై వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు.
2027లో బన్నీతో సినిమా ఉంటుందని తెలిపిన దిల్ రాజు, ఈ ప్రాజెక్టుకు “రావణం” అనే టైటిల్ ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.
ప్రస్తుతం బన్నీ, నీల్ ఇద్దరూ బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు నీల్. ఆ తర్వాత ‘సలార్-2’ చేయాల్సి ఉంది. ఇటు బన్నీ కూడా అట్లీ సినిమాకు ప్రివేర్ అవుతున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తారేమో చూడాలి. ఈ ప్రాజెక్టులన్నీ కొలిక్కి వచ్చిన తర్వాత బన్నీ-నీల్ సినిమా ఉంటుంది.