“దేవర” సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది జాన్వీ కపూర్. ఆమెకి తెలుగులో చాలా క్రేజ్ ఉంది. శ్రీదేవి కూతురు కావడం ప్రధాన కారణం. ఇక ‘దేవర’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. తాజాగా థాయిలాండ్ లో ఒక పాట తీశారు. ఈ రోజు (జూన్ 20)తో ఆ పాట చిత్రీకరణ పూర్తి అయింది.
జాన్వికి ఎన్టీఆర్ తో మొత్తం మూడు పాటలు ఉంటాయి. ఇప్పటికే ఒక పాట తీశారు. తాజాగా థాయిలాండ్ లో ఒకటి పూర్తి అయింది. మరో పాటని హైదరాబాద్ లో వేసిన సెట్ లో తీస్తారు. కుదిరితే మరో స్పెషల్ ప్రొమోషన్ పాట కూడా చిత్రీకరించొచ్చు. మొత్తమ్మీద ఒక నెల రోజుల వ్యవధిలో ఈ షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది.
సో, ఆ వెంటనే ఆమె రామ్ చరణ్ సినిమా (#RC16) షూటింగ్ మొదలు పెడుతుంది. రామ్ చరణ్ సరసన ఆమె నటించనుంది. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తీసే చిత్రంలో జాన్వీ మెయిన్ హీరోయిన్. ఆగస్టు చివర్లో కానీ, సెప్టెంబర్ మొదటివారంలో కానీ రామ్ చరణ్ తో జాన్వీ షూటింగ్ స్టార్ట్ చేస్తుంది.
ఈ రెండు సినిమాలు తెలుగులో ఆమెకి సాలిడ్ కెరీర్ సెట్ చేస్తాయి అనడంలో సందేహం లేదు.