
హీరోయిన్ జాన్వీ కపూర్ కి భక్తి ఎక్కువే. ఆమె ఏడాదికి ఆరేడు సార్లు తిరుపతి వెంకన్నని దర్శించుకుంటుంది. అలాగే అనేక ఇతర గుళ్లకు వెళ్తుంటుంది. పూజలు చేస్తుంటుంది.
ఐతే, ఆమె హైదరాబాద్ లోని మధురానగర్ లోని ఒక చిన్న గుడికి వెళ్లి పూజలు చెయ్యడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మధురానగర్ లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఆ ప్రాంతంలో, ఆ చుట్టూపక్కల ఉండే వారికే ఎక్కువగా తెలుసు. మిగతా ప్రాంతాల నుంచి ఆ గుడికి వచ్చి పూజలు చేసే వారు తక్కువ.
కానీ ఆ గుడి ప్రత్యేకత గురించి ఆమెకి ఎవరో వివరించినట్లు ఉన్నారు. దాంతో ఆమె గురువారం ఉదయం ఒక్కతే గుడికి వచ్చి అక్క పూజలు చేసింది.
జాన్వీ కపూర్ ఇటీవల “దేవర” సినిమాలో నటించింది. త్వరలోనే రామ్ చరణ్ సరసన నటించనుంది.