
చిరంజీవి తల్లి అంజనాదేవి ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు కొత్తేం కాదు. గతంలో ఓసారి ఇలానే పుకార్లు వచ్చాయి. వాటిని స్వయంగా చిరంజీవి ఖండించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు తల్లితో ఓ వీడియోను కూడా షేర్ చేశారు.
ఇప్పుడు మరోసారి అంజనాదేవి ఆరోగ్య పరిస్థితిపై కథనాలొచ్చాయి. అంజనాదేవి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, కేబినెట్ మీటింగ్ లో ఉన్న పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ కు వెళ్లారంటూ కొన్ని వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి.
ఈసారి నాగబాబు స్పందించారు. తన తల్లి క్షేమంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం సర్కులేట్ అవుతోందని, తన మాతృమూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు.
చిరంజీవి నివాసంలోనే ఉంటారు అంజనాదేవి. రామ్ చరణ్ భార్య ఉపాసన పర్యవేక్షణలో ఆమె ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. అపోలోకు చెందిన వైద్యుల బృందం ఆమెను నిత్యం పరీక్షిస్తుంది.