
అల్లు అర్జున్, త్రివిక్రమ్ మరోసారి కలిసి చేయబోతున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించనప్పటికీ, బన్నీ నెక్ట్స్ మూవీ అదేనని అందరికీ తెలుసు. ఇప్పటికే అల్లు అరవింద్, బన్నీ వాస్, నాగవంశీ లాంటి చాలామంది ఈ సినిమాపై చాలా ఎలివేషన్లు ఇచ్చారు.
పైగా ‘పుష్ప-2’ లాంటి హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో బన్నీ- త్రివిక్రమ్ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడీ సినిమాపై కొత్త ప్రచారం మొదలైంది. ఈ ప్రాజెక్ట్ కు ఉగాదిని ముహూర్తంగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
ఉగాది రోజున సినిమాను ప్రకటిస్తారా లేక ఆ రోజున సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారా అనే విషయం తెలియదు కానీ బన్నీ-త్రివిక్రమ్ సినిమా చుట్టూ ‘ఉగాది’ పేరు గట్టిగా వినిపిస్తోంది.
ఈ సినిమాకు ఓ ప్రోమో ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని నాగవంశీ గతంలో ప్రకటించాడు. మైథలాజికల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు ప్రోమో షూట్ చేసి, సినిమాను ఆర్భాటంగా ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించాడు.దాదాపు 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఇండియాలో ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాపై ప్రకటనకు ముందునుంచే అంచనాలు పెరుగుతున్నాయి. ఇంతకుముందు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు చేశారు.