
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ ఫ్లాట్ ను అమ్మకానికి పెట్టారు. ఇప్పుడా ఫ్లాట్ ను నటి అదా శర్మ దక్కించుకుంది.
సుశాంత్ ఫ్లాట్ ను అదా శర్మ కొనుగోలు చేసినట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ నటి వాటిని ధృవీకరించింది. నెల రోజులుగా తను సుశాంత్ ఫ్లాట్ లోనే ఉంటున్నట్టు వెల్లడించింది. ఇంటికి కొన్ని మార్పుచేర్పులు కూడా చేసినట్టు వెల్లడించింది.
ఫస్ట్ ఫ్లోర్ మొత్తాన్ని దేవుడి గదిగా మార్చేసిందట అదా. పై ఫ్లోర్ లో ఓ గదిని మ్యూజిక్ రూమ్ గా, మరో గదిని డాన్స్ స్టుడియోగా మార్చింది. ఇక టెర్రస్ మొత్తాన్ని గార్డెన్ గా మార్చేసిందట. తను ఎక్కడున్నా పచ్చదనం ఉండాలని, పక్షులకు ఆహారం పెట్టడం తనకు ఇష్టమని, అందుకే గార్డెన్ పెట్టుకున్నానని తెలిపింది.
సుశాంత్ ఇంట్లో అడుగుపెట్టగానే తనకు ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ కలిగిందని, దాన్ని మరింత పెంచేందుకు ఇళ్లు మొత్తానికి తెలుగు రంగు పెయింట్ వేయించినట్టు వెల్లడించింది.