విజయ్ దేవరకొండ ఇటీవల వరుస అపజయాలు చూశారు. దాంతో ఈ ‘అర్జున్ రెడ్డి’ హీరో కొంత నిరాశలో మునిగారు. ఐతే తిరిగి తన కెరీర్ ని ట్రాక్ లో పెట్టాలని కసిగా ఉన్నాడని అర్థం అవుతోంది. ఆయన తదుపరి మూడు చిత్రాలు కూడా టాలెంటెడ్ డైరెక్టర్స్ తీసేవే.
ఇప్పటికే “జెర్సీ” దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తీస్తున్న పీరియడ్ మూవీలో నటిస్తున్నారు విజయ్. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. ఇక దిల్ రాజు తమ సంస్థ తరఫున మరో చిత్రం ప్రకటించారు. “రాజావారు రాణిగారు” చిత్ర దర్శకుడు రవికిరణ్ కోలా గ్రామీణ నేపథ్యంగా ఒక యాక్షన్ సినిమా తీయనున్నారు.
తాజా సమాచారం ప్రకారం దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ చెప్పిన కథకు కూడా విజయ్ దేవరకొండ ఓకె చెప్పినట్లు టాక్. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
విజయ్ దేవరకొండ – రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్ లో ఇంతకుముందు “టాక్సీవాలా” వచ్చింది. అది హిట్. ఆ తర్వాత ఆ దర్శకుడు నానితో “శ్యామ సింగ రాయ్” అనే భారీ చిత్రం తీసి విజయం అందుకున్నారు. ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండతో మూవీ సెట్ అయింది. మొత్తంగా విజయ్ దేవరకొండ మూడు కొత్త సినిమాలు ఇవే.