
విలక్షణ పాత్రలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే. సౌత్ లో కూడా ఈమె కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత అదే సౌత్ నటుడిపై ఆమె కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కూడా చేసింది. అలా సౌత్ సినిమాలకు ఆమె దూరమైంది.
తమిళ్ లో ఆమె ‘ధోని’, ‘కబాలి’ లాంటి సినిమాలు చేసింది. ఇక తెలుగులో ‘లయన్’, ‘లెజెండ్’ సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఈమధ్య బిడ్డకు జన్మనిచ్చిన రాధికా ఆప్టే, మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటోంది.
తన సినిమాలో ఓ పాత్ర కోసం రాధిక ఆప్టేను సంప్రదించాడట దర్శకుడు పూరి జగన్నాధ్. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా రాబోతోంది. ఇప్పటికే సీనియర్ నటి టబును ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఇప్పుడు సేతుపతికి జోడీగారాధికా ఆప్టేని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి వస్తుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. పూరి, విజయ్ సేతుపతి, రాధికా ఆప్టే కాంబినేషన్ అంటే చూడ్డానికి ఆసక్తికరంగా ఉంది.