
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను మానసికంగా ఇప్పటికీ బాధపెడుతున్నాడట. అయితే ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగానే.
ప్రభాస్ విషయంలో నిత్యామీనన్ చేసిన తప్పు, అతడి అభిమానులకు ఇంకా గుర్తే. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి అడిగితే అతడెవరో తనకు తెలియదంటూ స్పందించింది నిత్యా మీనన్.
ఆ టైమ్ లో ప్రభాస్ ఫ్యాన్స్, ఆమెపై విరుచుకుపడ్డారు. ఆ ట్రోలింగ్ ను నిత్యామీనన్ తట్టుకోలేకపోయింది. ఆ బాధ తనను ఇంకా వెంటాడుతోందని, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది నిత్యా.
తెలుగులో కెరీర్ అప్పుడే మొదలుపెట్టానని, నిజంగా అప్పుడు తనకు ప్రభాస్ తెలియదని, అయితే ఆ విషయాన్ని అలా ఓపెన్ గా చెప్పడం తప్పనే విషయాన్ని ఆ తర్వాత తెలుసుకున్నానని అంటోంది నిత్యామీనన్. మీడియా ముందు మాట్లాడేటప్పుడు లౌక్యం అవసరమనే విషయాన్ని కూడా ఆ ఘటన తోనే తెలుసుకున్నట్టు వెల్లడించింది.
ఇప్పటికీ ఆ ఇష్యూ తనను మానసికంగా వెంటాడుతోందని, ప్రభాస్ ఎవరో తెలియదని చెప్పడం తనను ఇప్పటికీ బాధిస్తోందని గిల్ట్ ఫీల్ అవుతోంది నిత్యామీనన్.