
భారతీయ సినిమా ప్రపంచంలో సినిమా హీరోయిన్ల స్థాయిలో అందచందాలతో అదరగొట్టే గాయనీమణులు చాలా మంది ఉన్నారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాలి… జోనిత గాంధీ. తెలుగులో “ఏవో ఏవో కలలే” (లవ్ స్టోరీ) వంటి హిట్ సాంగ్స్ పాడిన ఆమెకి ఉంది. ఏ ఆర్ రెహమాన్, తమన్, అనిరుధ్ స్వరపర్చే పాటలు ఎక్కువగా పాడుతుంది.
ఐతే, ఆమె పాటల కన్నా ఆమె స్టేజీ షోలకు క్రేజ్ ఎక్కువ. స్టేజిపై ప్రదర్శించే అందచందాల ప్రదర్శన సినిమాల్లో ఐటెం సాంగ్ ల్లో హీరోయిన్లు చేసే షో కన్నా అధికంగా ఉంటుంది మరి. అందుకే, ఆమెకి కుర్రకారులో బాగా పాపులారిటీ వచ్చింది.
ఐతే, ఈ ఇమేజ్ వల్ల తను పడుతున్న ఇబ్బందులు కూడా ఎక్కువే.
ఆమెకి చాలా మంది కుర్రాళ్ళు తమ ప్రైవేట్ పార్టుల ఫోటోలు మెసేజ్ చేస్తున్నారట. ఇలాంటి అసభ్యకరమైన సందేశాలు తన ఇన్ స్టాగ్రామ్ మెసేజ్ లలో, వాట్సాప్ లలో వస్తున్నాయట. చాలా వరకు ఆమె బ్లాక్ చేసినా ఈ బాధ చెప్పుకోలేనంత ఇబ్బంది అంటోంది.