యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు లక్షల్లో అభిమానులున్నారు. వాళ్లలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి తను కూడా చేరిపోయానంటోంది జాన్వి కపూర్. తారక్ తో కలిసి “దేవర” సినిమా చేసిన ఈ బ్యూటీ, అతడ్ని దగ్గరుండి చూసిన తర్వాత వీరాభిమానిని అయిపోయానని అంటోంది.
ముంబయిలో “దేవర-1” ట్రయిలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జాన్వి కపూర్.. సెట్స్ లో ఎన్టీఆర్ ను చూసి చాలా నేర్చుకున్నానని తెలిపింది. ఎన్టీఆర్ నిబద్ధత, వ్యక్తిత్వం చూసిన తర్వాత అతడికి ఫ్యాన్ అయిపోయానని తెలిపింది.
కుదిరితే తారక్ తో మళ్లీమళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్నానని వెల్లడించింది జాన్వి కపూర్.
దేవర-1 ట్రయిలర్ లో జాన్వి కపూర్ పల్లెటూరి పిల్లగా కనిపించింది. ఆమె పాత్ర పేరు ‘తంగం’. సినిమాలో ఆమెది కీలకమైన పాత్ర అనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్, జాన్వీ మీద తీసిన “చుట్టమల్లే” పాట బాగా వైరల్ అయింది. ఈ మాస్ స్టార్ తో ఆమె హాట్ కెమిస్ట్రీ బాగుంది అని అంటున్నారు జనం.