
సోనాక్షి సిన్హా ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకొంది. బాలీవుడ్ లో కూడా ఆమెకి పెద్ద సినిమా ఆఫర్లు లేవు ఇప్పుడు. ఇలాంటి టైంలో ఈ భామ తెలుగులోకి అని వార్తలు వస్తున్నాయి.
ఈ ‘దబాంగ్’ బ్యూటీ తెలుగులో సుధీర్ బాబు సరసన నటించనుంది అని టాక్. సుధీర్ బాబు “ఝాటధరా” అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ కి చెందిన ప్రేరణ అరోరా అనే నిర్మాత ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఒక పెద్ద హీరోయిన్ ని తీసుకోవాలని ప్రయత్నించి చివరికి సోనాక్షిని తీసుకున్నారట.
సోనాక్షి గతంలో బాలకృష్ణ సరసన ఒక సినిమాలో చెయ్యాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఆమె నో చెప్పింది. అలాగే మెగాస్టార్ సరసన “ఆచార్య”లో మొదట ఆమెని తీసుకోవాలనుకున్నారు. మొత్తానికి ఈ భామ ఇప్పుడు తెలుగులో అరగేంట్రం చెయ్యనుంది అన్నమాట.
ఐతే, అధికారిక ప్రకటన రావాలి.