‘పుష్ప-2’ టికెట్ రేట్స్ పై ఇప్పుడు హాట్ హాట్ చర్చ సాగుతోంది. దీనికి కారణం ఈ సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచడమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు, దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ‘పుష్ప-2’ టికెట్ రేట్లు చూస్తే కళ్లు బైర్లుకమ్మడం ఖాయం.
ముందుగా తెలంగాణ విషయానికొస్తే.. ఈ సినిమా ప్రీమియర్స్ కు ఏకంగా 1200 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇదేదో బ్లాక్ లో రేటు కాదు. ప్రభుత్వ అనుమతితో నిర్మాతలు అధికారికంగా ఫిక్స్ చేసిన రేటు. దీంతో ఈ టికెట్ రేటు బ్లాక్ లో 2500 రూపాయలైంది.
అటు ఏపీలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. ప్రభుత్వ అనుమతితో ప్రీమియర్ షోకు ఏకంగా 800 రూపాయల టికెట్ ఫిక్స్ చేశారు. జీఎస్టీతో కలిపి రేటు అటుఇటుగా 900 అవుతుంది. బ్లాక్ లో ఈ సినిమా టికెట్ ను 1600 నుంచి 2వేల రూపాయల మధ్యలో అమ్ముతున్నారు.
ఇక ‘పుష్ప-2’కు అత్యథిక టికెట్ రేటు ఎక్కడుందో తెలుసా? ముంబయిలోని బీకేసీలో ఉన్న జియో పీవీఆర్ వరల్డ్ లో టికెట్ ధర అక్షరాలా 3వేల రూపాయలుంది. ఇటు బెంగళూరులో ఈ సినిమా టికెట్ రేటు (ప్రీమియర్స్ కాకుండా) 2500 రూపాయలు ఉంది.