
సరిగ్గా నెల రోజుల కిందట తను గర్భం దాల్చిన విషయాన్ని బయటపెట్టింది లావణ్య కొణెదల త్రిపాఠి. అంతే, ఆ తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించలేదు. మళ్లీ ఇన్ని రోజులకు లావణ్య బయటకొచ్చింది. కెమెరా కంట పడింది.
భర్త వరుణ్ తేజ్ తో కలిసి ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది లావణ్య. అలా తొలిసారి ఆమె బేబీ బంప్ తో కనిపించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హీరోయిన్లు ఇప్పుడు తమ గర్భాన్ని దాచుకోవడం లేదు. ఎఁచక్కా బేబీ బంప్ తో ఫొటోషూట్స్ కూడా చేస్తున్నారు. వాటిని అందమైన జ్ఞాపకాలుగా మలుచుకుంటున్నారు. పనిలోపనిగా తమ అభిమానులతో కూడా షేర్ చేసుకుంటున్నారు. అయితే లావణ్య ఇంకా అక్కడివరకు రాలేదు.
ప్రస్తుతం లావణ్య చేతిలో ‘సతీ లీలావతి’ ప్రాజెక్టు ఉంది. షూటింగ్ తో పాటు, దాని డబ్బింగ్ కూడా పూర్తిచేసింది లావణ్య. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి తన కెరీర్ ను ఆమె కొనసాగిస్తుంది.