
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది.
చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తున్న నయనతార ఈ రోజు షూటింగ్ లో జాయిన్ అయ్యారు. చిరంజీవి, నయనతార ఇంతకుముందు “సైరా” చిత్రంలో భార్యాభర్తలుగా నటించారు. ఆ తర్వాత “గాడ్ ఫాదర్”లో బ్రదర్ – సిస్టర్ గా మారిపోయారు. ఇప్పుడు మళ్ళీ రొమాంటిక్ జంటగా నటిస్తున్నారు.
కథా పరంగా, పాత్ర పరంగా నయనతారని ఈ సినిమా ఎగ్జైట్ చేస్తోందట. ఈ సినిమా ప్రమోషన్ల్లో ఆమె చురుకుగా పాల్గొనాలని నిశ్చయించుకున్నారని టాక్. ఇటీవలే ఆమె ఒక ప్రత్యేక ప్రమోషనల్ వీడియో చేశారు.
ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 10, 2026న విడుదల చెయ్యనున్నారు.