
రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో అత్యంత వివాదాస్పదమైన మూవీ “ఎంపురాన్-లూసిఫర్ 2”. మోహన్ లాల్ హీరోగా పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్ ను కొంతమంది తీవ్రంగా వ్యతిరేకించారు. కేరళలో ఈ సినిమా రాజకీయ దుమారం కూడా రేపింది.
నిర్మాత, దర్శకుడి ఆస్తులపై ఐటీ రైడ్స్ కూడా జరిగాయి. ఇలా అత్యంత వివాదాస్పదమైన ఈ సినిమా నుంచి కొన్ని సన్నివేశాల్ని ఆఘమేఘాల మీద తొలిగించారు. అలా వివాదాస్పదమైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది.
జియో హాట్ స్టార్ లో 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది “ఎంపురాన్-లూసిఫర్ 2”. మరి ఓటీటీలో ఒరిజినల్ వెర్షన్ పెడతారా? కట్ చేసిన వెర్షన్ పెడతారా? నిన్నట్నుంచి జరుగుతున్న ఈ చర్చకు తెరపడింది.
జియో హాట్ స్టార్ లో ఎడిటెడ్ వెర్షన్ నే స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నారు.
ఎందుకంటే, సిల్వర్ స్క్రీన్ తో పాటు, ఓటీటీకి కూడా ఇప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ విషయంలో నెట్ ఫ్లిక్స్ పలు వివాదాలు ఎదుర్కొంది. కాబట్టి మరోసారి వివాదాలు చెలరేగకుండా ఉండేందుకు, అభ్యంతరకర సన్నివేశాలు లేకుండానే “ఎంపురాన్-లూసిఫర్ 2” సినిమాను స్ట్రీమింగ్ కు ఉంచబోతోంది జియో హాట్ స్టార్.