
చిరంజీవి, అనీల్ రావిపూడి సినిమా కీలకమైన షెడ్యూల్ లోకి ఎంటరైంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముస్సోరీలో మొదలైంది. దాదాపు 10-12 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. సినిమాకు ఇది కీలకమైన షెడ్యూల్ అంటున్నారు.
“సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకి సంబంధించిన చాలా సీన్లు ముస్సోరి పరిసర ప్రాంతాల్లోనే తీశారు. అనిల్ రావిపూడి మళ్ళీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. తాజా షెడ్యూల్ లో చిరంజీవి, క్యాథరీన్ మధ్య కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. నయనతార కూడా జాయిన్ అవుతుంది.
సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఇందులో శివశంకర వరప్రసాద్ అనే పాత్రలో కనిపించబోతున్నారు చిరంజీవి. ఇది ఆయన రియల్ నేమ్ అనే విషయం తెలిసిందే.
ఓవైపు టాకీ పూర్తిచేస్తూనే, మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కొనసాగిస్తున్నాడు అనీల్ రావిపూడి. ఇప్పటివరకు చిరంజీవి 3 ట్యూన్స్ ఓకే చేశారట. భీమ్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.