
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం “జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ” ఇంతవరకు విడుదల కావడం లేదు. ఈ సినిమా సెన్సార్ సమస్యల్లో చిక్కుకొంది.
అనుపమ పరమేశ్వరన్ సినిమాకి సెన్సార్ రావడానికి కారణం ఆ టైటిల్ లో జానకి అనే పేరు ఉండడమే. ఒక లీగల్ కేసు నేపథ్యంగా తీసిన సినిమాకి సీతాదేవి పేరు పెట్టడం వచ్చింది. ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్న వచ్చింది. దాంతో, సెన్సార్ బోర్డు ఇంతవరకు సినిమాకి క్లియరెన్స్ ఇవ్వలేదు.
ఇటీవల మోహన్ లాల్ హీరోగా రూపొందిన “ఎల్ 2 ఎంపురాన్” సినిమాలోని కొన్ని సన్నివేశాలు పెద్ద రాజకీయ దుమారం రేపాయి. హిందూ మతం, బీజేపీకి వ్యతిరేకంగా అవి ఉన్నాయి అని విమర్శ రావడంతో, నిర్మాతలు తమంతట తామే ఆ సన్నివేశాలను తొలగించారు. అప్పటి నుంచి, కేరళలోని సెన్సార్ బోర్డు ప్రతి సినిమాని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది.
అందుకే,అనుపమ చిత్రం సమస్యలు ఎదుర్కొంటోంది. మోహన్ లాల్ మూవీ వల్లే ఇలా జరుగుతోందని మలయాళ నిర్మాతలు అంటున్నారు.